ఎపిలో కొత్తగా 1,063మందికి పాజిటివ్‌

అమరావతి,ఆగస్టు17(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో 59,198 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, 1,063మందికి పాజిటివ్‌ వచ్చింది. తాజాగా కరోనాతో పోరాడుతూ 11 మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందగా, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున కన్నుమూశారు. అనంతపురంలో ఒకరు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,95,669కు చేరింది. మరోవైపు 1,929మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,65,657 మంది కరోనా నుంచి బయటపడ్డారు. మృతుల సంఖ్య 13,671కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,341 యాక్టివ్‌ కేసులున్నాయి.