ఏసీబీ దాడులు

మహబూబ్‌నగర్‌: స్థానిక ఆంధ్రప్రదేశ్‌ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గద్వాల డివిజన్‌ పరిధిలో పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఒక కాంట్రాక్టర్‌ నుంచి రూ.75వేలు లంచం తీసుకుంటూ వర్క్‌ ఇన్స్‌స్పెక్టర్‌ చంద్రశేఖరరావు పట్టుబడ్డారు. ఈ మేరకు ఆయన నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.