ఐటిరంగ విస్తరణతో మారుతున్న పరిణామాలు

రానున్న రెండుమూడేళ్లలో ఇరు తెలుగు రాష్టాల్ల్రో ఐటి రంగం భారీగా విస్తరించనుందన్న సమాచారం ఓ రకంగా అభివృద్దికి సంకేతంగా భావించాలి.  రాష్ట్ర విభబజనకు ముందు , తరవాత స్తబ్దత ఆవరించడంతో పాటు ఈ రంగం విస్తరణపై నీలినీడలు కమ్మకున్నాయి. కానీ అనూహ్యంగా తెలంగాలో ఐటి శాఖ మంత్రి కెటి రామారావు నిరంతరంగా ఈ రంగంపై దృష్టి పెట్టారు. వివిధ రంగాల పెద్దలను కలుసుకుని వారి సూచనలు,సలహాల మేరకు ఐటి పాలసీని తీసుకుని వచ్చారు. టాటా, రిలయన్స్‌, గూగుల్‌, మైక్రోసాప్ట్‌, టెక్‌ మహింద్ర లాంటి కంపెనీల అధిపతులు ఇక్కడికి వచ్చి ఐటి పాలసీని అభినందించాయి. స్టార్టప్‌ కంపెనీలకు నీరు పోశారు. ప్రత్యేకచొరవ కారణంగా ఒక్కసారిగా ఐటి రంగం దూసుకుని పోయే స్థితికి వచ్చింది. ఇదో రకంగా నిరుద్యోగులకు వరం కానుంది. బెంగుళూరు స్థాయిలో ఐటి విస్తరణకు అవకాశాలు వచ్చాయి. ప్రధానంగా శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించడం, నిరంతర విద్యుత్‌ వంటి అంశాలు కూడా ఐటి విస్తరణకు అవకాశాలను ఇనుమడింప చేశాయి. ఇక ఎపిలోనూ చంద్రబాబు తనకున్న బ్రాండ్‌ ఇమేజ్‌తో ముందుకు సాగుతున్నారు. విశాఖలో ఐటి విస్తరణ చురుకుగా సాగుతోంది. హుద్‌హుద్‌ తుపాన్‌ తరవాత అక్కడ పునర్నిర్మాణం చూశాక ఐటి దిగ్గజాలే ముక్కున వేలేసుకున్నారు. అందుకే ఎపిలో కూడా ప్రత్యేకంగా పెట్టుబడులకు ఐటి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అమరావతి నిర్మాణం జరిగితే ఎపి రాజధాని అమరావతి కూడా ఐటికి అడ్రస్‌గా మారనుంది. విభజన తరవాత పారిశ్రామిక అభివృద్ది, ఉద్యోగాల కల్పనలో ఇరు రాష్టాల్ర సిఎంలు పోటీ పడి పనులు చేపడుతున్నారు. అలాగే అభివృద్ది కోసం పరుగులు తీస్తున్నారు. దేశంలో బహుశా ఈ మధ్యకాలంలో కేంద్రంలో మోడీ కన్నా కూడా ఇరు తెలుగు రాష్టాల్ల్రో పోటీ పెరిగింది. ఐటి, సాగునీటి రంగం, పారిశ్రామిక రంగాల్లో పోటీ పెరిగింది. బహుశా గతంలో ఎప్పుడూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇంతగా అభివృద్ది సాధించిన దాఖలాలు లేవు. ఇది ఓ రకంగా తెలుగు ప్రాంతాలకు శుభసూచకంగానే భావించాలి. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం ఎలా ఉండాలన్న ప్రణాళికతో ఇరు రాష్టాల్రు ముందుకు సాగుతున్నాయి. కమిట్‌మెంట్‌ ఉన్న లీడర్లు సిఎంలుగా ఉండడంతో పనులు కూడా అదే కోవలో సాగుతున్నాయి. భిన్న ధృవాలుగా ఉన్నప్పటికీ లక్ష్యం మాత్రం అభివృద్ది కావడం వల్ల పారిశ్రామికవేత్తలు సైతం పోటీ పడే పరిస్తితి ఏర్పడింది. అందుకే ఇరు రాష్టాల్ల్రో పారిశ్రామిక ప్రగతి వచ్చే మూడు నాలుగేళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే వీలుంది. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా అబివృద్ది నినాదంలో ఇద్దరు సిఎంలు చంద్రబాబు, కెసిఆర్‌లు పనిచేస్తున్న తీరు అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఆకట్టుకుంటోంది.  తెలంగాణలో సత్వర పారిశ్రామికాభివృద్ధికి బాటలుపరిచేలా సరికొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకుతీసుకొచ్చింది. పరిశ్రమల అనుమతి ప్రకియను సరిళీకరించింది. పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతుల జారీలో పారదర్శకత, జాప్యం నివారణ, సంబంధిత సంస్థలు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యహరించేలా కాలవ్యవధితో కూడిన కట్టుదిట్టమైన నిబంధనలను ప్రతిపాదించింది.  అదే సమయంలో పారిశ్రామికవేత్తలూ నిబంధనలకు బద్ధులయ్యేలా పలు జాగ్రత్తలు తీసుకొంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి, స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం- టీఎస్‌ఐపాస్పభ్రుత్వం అమలు చేస్తోంది.తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడం, పరిశ్రమలకు అనుమతులు ఒకే చోట మంజూరు చేసి, వాణిజ్య ఉత్పత్తులను వెంటనే ప్రారంభించేలా చేయడం దీని లక్ష్యమని ప్రభుత్వం ఈ విధానం ద్వారా వెల్లడించింది. నోడల్‌ ఏజెన్సీలు ఇక చురుకుగా పనిచేస్తాయి. దీంతో పారిశ్రామికవేత్తలకు సులువుగా అనుమతులు వస్తాయి.

ఎపిలో పెట్టుబడులకు ఇప్పటికే చంద్రబాబు  విదేశీ పర్యటనలు చేపట్టారు. వివిధ కంపెనీల అధిపతులు ఇప్టపికే ఎపిలో పెట్టుబడులకు ముందుకు వచ్చారు.  దీంతో ఎపిలో కూడా పెట్టుబడులు వెల్లువలా వచ్చే అవకాశం ఉంది. ఒక్క దరఖాస్తు చేసుకొని వెళ్లిపోతే మొత్తం అనుమతుల పక్రియకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని, పారిశ్రామికవేత్తల ఇంటికి వాటిని పంపిస్తామని  సిఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచదేశాలతో పోల్చితే భారత్‌లో పెట్టుబడులే లాభదాయకంగా ఉంటాయి. అందునా ఆంధ్రప్రదేశ్‌లో పెడితే మరింత లాభదాయకంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకేతాలు పంపారు. అందుకే విశౄఖ ,విజయవాడ, రేపటి అమరావతిల్లో పెట్టుబడులకు ఆయా సంస్థలు ముందుకు వస్తున్నాయి.  రాష్టాన్న్రి వేగంగా అభివృద్ధిపట్టాలపైకి ఎక్కించాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు అందుకు అనుగుణంగా కార్యాచరణ చేస్తున్నారు. ఓడరేవుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తూ కారిడార్‌ అభివృద్దికి శ్రీకరాం చుట్టారు. నదుల అనుసంధానంతో నీటి సమస్యలు అధిగమించే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే పోలవరం త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇవన్నీ కూడా భవిష్యత్‌ అభివృద్దికి సూచికలుగా తీసుకోవాలి. ఇలా ఇరు రాష్టాల్ల్రో ఉన్న వనరులను పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తున్నారు. దీంతో అన్ని రంగాల్లో రానున్న మూడేళ్లలలో గణనీయమైన మార్పులు గోచరం కానున్నాయి.