‘మొస్సాద్‌’పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

` టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
` ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి
` ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం
టెల్‌అవీవ్‌(జనంసాక్షి):ఇరాన్‌ ఇజ్రాయెల్‌ మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ గగనతల దాడులు చేస్తుండగా.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్‌ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఐదో రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌ గూఢచర్య సంస్థ మొస్సాద్‌ కేంద్ర కార్యాలయంపై ఇరాన్‌ దాడికి పాల్పడిరది. అత్యంత కచ్చితత్వంతో మొస్సాద్‌ కేంద్ర కార్యాలయంపై క్షిపణుల వర్షం కురిపించినట్లు ఇరాన్‌ మీడియా వెల్లడిరచింది. అంతేకాకుండా గ్లిలాట్‌లోని ఇజ్రాయెల్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ కాంప్లెక్స్‌పైనా క్షిపణి ప్రయోగించినట్లు తెలిపింది.ఇజ్రాయెల్‌ పక్కా ప్రణాళికలతో దాడులు చేస్తోందంటే.. దానికి కారణం కచ్చితంగా మొస్సాద్‌ సంస్థే. ఇరాన్‌లో అణుస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి నుంచి.. కీలక అధికారులు, శాస్త్రవేత్తల గృహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇజ్రాయెల్‌కు చేరవేసింది. అంతేకాకుండా ముందుగానే ఇరాన్‌కు భారీ మొత్తంలో డ్రోన్లను తరలించి ఇజ్రాయెల్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌ నిర్వహించడం వెనుకా ఈ సంస్థ హస్తముంది. ఈ నేపథ్యంలోనే మొస్సాద్‌ కేంద్ర కార్యాలయంపై ఇరాన్‌ క్షిపణి ప్రయోగించినట్లు తెలుస్తోంది.మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తుల ద్వారా అటు ఇజ్రాయెల్‌, ఇటు అమెరికాలకు సమాచారం ఇచ్చిన ఇరాన్‌.. దాడులు మాత్రం ఆపడం లేదు. ఇరుదేశాల మధ్య మొదలైన ఈ సంఘర్షణపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే కెనడాలో జరుగుతున్న జీ-7 సదస్సుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మధ్యలోనే తన పర్యటన ముగించుకొని ఆగమేఘాల మీద అమెరికా పయనమయ్యారు. ఇరాన్‌ చేపడుతున్న అణుకార్యక్రమానికి నిజమైన ముగింపు ఉండాలని ఆయన చెప్పడం.. యుద్ధం తీవ్రత మరింత పెరుగుతుందన్న సంకేతాలు ఇస్తోంది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల మధ్య యుద్ధం ఐదో రోజూ కొనసాగుతోంది. తాజాగా టెహ్రాన్‌పై టెల్‌అవీవ్‌ చేసిన దాడుల్లో ఇరాన్‌ సీనియర్‌-మోస్ట్‌ మిలిటరీ అధికారి, ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహిత సైనిక సలహాదారు అయిన అలీ షాద్మానీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ దళాలు వెల్లడిరచాయి. ఆయన సెంట్రల్‌ టెహ్రాన్‌లోని ఓ ప్రదేశంలో తల దాచుకున్నట్లు తమకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ చేస్తున్న పలు క్షిపణి దాడులకు అలీ షాద్మానీ నేతృత్వం వహించారని తెలిపింది. ఇదివరకు షాద్మానీ అల్‌-అన్బియా అత్యవసర కమాండ్‌ సెంటర్‌ డిప్యూటీ కమాండర్‌గా, ఇరాన్‌ సాయుధ దళాల జనరల్‌ స్టాఫ్‌ ఫోరమ్‌లో ఆపరేషన్స్‌ డైరెక్టరేట్‌ అధిపతిగా విధులు నిర్వహించాడు.మరోవైపు ఇరాన్‌..ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు చేస్తోంది. మంగళవారం దాదాపు 20 బాలిస్టిక్‌ క్షిపణులను టెల్‌అవీవ్‌పై ప్రయోగించడంతో భారీ నష్టం సంభవించినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. భవనాలు, వాహనాలపై క్షిపణులు పడడంతో మంటలు ఎగసిపడుతున్నట్లు తెలిపింది. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు పలువురు ఇరాన్‌ కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌కు చెందిన సాయుధ దళాల జనరల్‌ స్టాఫ్‌ నిఘా డిప్యూటీ జనరల్‌ ఘోలామ్రేజా మెహ్రాబీ, ఆపరేషన్‌ డిప్యూటీ జనరల్‌ మెహదీ రబ్బానీ, ఇరానియన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) చీఫ్‌ మేజర్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ, సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్‌ మహమ్మద్‌ బాఘేరి, దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్‌ అమీర్‌అలీ హాజీజదే, పలువురు అణుశాస్త్రవేత్తలు మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు. యుద్ధం విషయంలో సోమవారం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (%దీవఅjaఎఱఅ చీవ్‌aఅవaష్ట్రబ%) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. దీంతో టెల్‌అవీవ్‌..టెహ్రాన్‌లోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

 

టెహ్రాన్‌ను తక్షణమే వీడండి
` భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
టెహ్రాన్‌(జనంసాక్షి): ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్‌ జరుపుతున్న పేలుళ్లతో టెహ్రాన్‌ నగరం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయ పౌరులను ఉద్దేశిస్తూ మన ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్లాలని సూచించింది.‘’టెహ్రాన్‌లోని భారతీయులు, పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారులందరూ తమ తమ సొంత మార్గాల్లో నగరాన్ని వీడండి. టెహ్రాన్‌ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్‌ అవ్వండి. మీరు ఉంటున్న లొకేషన్లు, మొబైల్‌ నంబర్లను వారితో పంచుకోండి’’ అని ఇరాన్‌లోని భారత ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడిరచింది. టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయి. నేరుగా అమెరికా యుద్ధ రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఈ ప్రకటన చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని అమెరికా అధ్యక్షుడు తిరుగు ప్రయాణమయ్యారు. వచ్చీరాగానే సిట్యుయేషన్‌ రూమ్‌లో భద్రతా సలహాదారులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. మరోవైపు.. చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఇరాన్‌లోని తమ పౌరులకు హెచ్చరికలు చేశాయి. వెంటనే టెహ్రాన్‌ నుంచి వెళ్లిపోవాలని సూచించాయి. అటు ఇజ్రాయెల్‌లోని చైనీయులు కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీజింగ్‌ అడ్వైజరీ జారీ చేసింది.

 

ఇరాన్‌ అణుకార్యక్రమానికి ముగింపు పలకాలి
` ఘర్షణల వేళ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్‌(జనంసాక్షి): ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య దాడులు ఉద్ధృతమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.్ణ ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం దిశగా ప్రయత్నాలు చేయాలని గతంలో చెప్పిన ఆయన.. తాజాగా పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణను తాను కోరుకోవడం లేదన్నారు. అయితే, ఇరాన్‌ అణు సమస్యకు ‘నిజమైన ముగింపు’ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కెనడాలో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశం నుంచి అర్ధాంతరంగా అమెరికాకు పయనమైన ట్రంప్‌.. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ ( అమెరికా అధ్యక్షుడి విమానం)లో విలేకరులతో మాట్లాడారు.‘’ ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేస్తానని నేను చెప్పలేదు. దీనికి కచ్చితంగా ఓ నిజమైన ముగింపు ఉండాలి. అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇరాన్‌ పూర్తిగా విరమించుకునేలా ఉండాలి’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మిడిల్‌ ఈస్ట్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న స్టీవ్‌ విట్‌కాఫ్‌ను గానీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను గానీ చర్చలకు పంపే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేయడం లేదంటూ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తుల్సి గబ్బార్డ్‌ వ్యాఖ్యలను ట్రంప్‌ కొట్టిపారేశారు. అణ్వాయుధ తయారీకి ఇరాన్‌ అతి చేరువలో ఉందని చెప్పారు.ఇజ్రాయెల్‌ తమపై దాడి చేయడానికి పరోక్షంగా అమెరికా సాయం చేస్తోందని ఇరాన్‌ అనుమానిస్తున్న నేపథ్యంలో.. ఆ దేశానికి ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికాపై దాడులకు దిగితే.. కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిదాడులు ఉంటాయని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇజ్రాయెల్‌ దాడులను మరింత ఉద్ధృతం చేసే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. అమెరికా జోక్యం లేకుండానే ఇరాన్‌ అణుకార్యక్రమం నామరూపాల్లేకుండా పోతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అప్పుడే నిజమైన ముగింపు లభిస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు.