మూడెకరాల రైతులకు తొలుత రైతుభరోసా

1,551.89 కోట్ల రూపాయలను విడుదల చేశాం: తుమ్మల
ఖమ్మం,జూన్‌ 17(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. మంగళవారం 1,551.89 కోట్ల రూపాయలను విడుదల అయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ రోజు 3 ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా నిధుల జమ చేయడం జరిగిందని వెల్లడిరచారు. అయితే, అందుకోసం 1551.89 కోట్ల రూపాయలను విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశాం అన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు.