నేటి నుంచి ‘టెట్‌’

` 30 వరకు కొనసాగనున్న పరీక్షలు
– ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 30 వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 66 కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌, ఐఏఎస్‌ ఈ మేరకు వెల్లడిరచారు.