ఓటిటిలో స్ట్రీమ్‌ అవుతున్న ఎఫ్‌`3

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ చిత్రం ’ఎఫ్‌`3’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో వచ్చిన ’ఎఫ్‌`2’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ మే 27న విడుదలైన ఈ చిత్రం సీక్వెల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా రెట్టింపు ఎంటర్‌టైమెంట్‌తో ప్రేక్షకులను
విపరీతంగా ఆకట్టుకుంది. వెంకీ, వరుణ్‌ల కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అనిల్‌ రావిపూడి మరోసారి ఆడియెన్స్‌ను రెండున్నర గంటలు హాయిగా నవ్వుకునేలా చేశాడు. కానీ పోటీగా ’విక్రమ్‌’, ’మేజర్‌’ చిత్రాలు విజయవంతంగా ప్రదర్శించడంతో ’ఎఫ్‌`3’ బ్రేక్‌ ఈవెన్‌ సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఓటీటీలో గత రాత్రి నుండి స్ట్రీమిగ్‌ అవుతుంది. ’ఎఫ్‌`3’ చిత్రం నెట్‌ప్లిక్స్‌, సోనిలివ్‌ రెండు డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రసారం అవుతుంది. మేకర్స్‌ తెలిపిన ప్రకారమే ఈ చిత్రం విడుదలైన 50రోజుల తర్వాత ఓటీటీలో విడుదలైంది. ఈ మధ్య కాలంలో సినిమాలన్ని దాదాపుగా నెలలోపే ఓటీటీలలో దర్శనమిస్తున్నాయి. కాగా ఈ చిత్రం దాదాపు 8 వారాల తర్వాత డిజిటల్‌లోకి రావడం విశేషం అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. తమన్నా, మెహరిన్‌లు కథానాయికలుగా నటించగా సునీల్‌, సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు.