కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద


కర్నూలు,ఆగస్ట్‌10(జనం సాక్షి): కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్నాటక నుంచి నీరు రావడంతో శ్రీశైలం జలాశయానికి 1,44,726 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి ఔట్‌ ప్లో 90,125 క్యూసెక్కులుగా ఉన్నది. డ్యామ్‌ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం.. నీటిమట్టం 884.10 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 212.91 టీఎంసీలు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ జలాశయానికి ఎగువ నుంచి వరద వస్తోంది. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో దిగువన సాగర్‌కు చేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ప్లో, ఔట్‌ ప్లో 65,938 క్యూసెక్కులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 589.60 అడుగులున్నది. గరిష్ఠ స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ఇప్పుడు 310.8498 టీఎంసీలు నిల్వ ఉన్నది. పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుంది. పులిచింతల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ : 16.49 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం : 175 అడుగులుగా, ప్రస్తుత నీటిమట్టం : 151.146 అడుగులుగా కొనసాగుతుంది. పులిచింతల ఇన్‌ ఎª`లో : 80,587 క్యూసెక్కులు కాగా, అవుట్‌ ఎª`లో : 15,372 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.