కేబినెట్‌ కీలక నిర్ణయాలు

` 201కి.మీ మేర ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి పచ్చజెండా
` చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు రీజనల్‌ రింగ్‌రోడ్డు
` నేటితో రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుంది
` బనకచర్ల చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తాం
` గోదావరి జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోం
` గోదావరి జలాల విషయంలో జులై మొదటి వారంలో కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినిపిస్తాం
` కాళేశ్వరంపై ఈనెల 30లోపు కమిషన్‌కు పూర్తి వివరాలు అందిస్తాం
` నేటితో రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుంది
` మంత్రివర్గ సమావేశ వివరాలు మీడియాకు వెల్లడిరచి మంత్రి పొంగులేటి
హైదరాబాద్‌(జనంసాక్షి):చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు 201కి.మీ మేర ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సోమవారం సుదీర్ఘంగా భేటీ అయిన కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడిరచారు. రేపటితో రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుందని, 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల మొత్తాన్ని రైతులకు అందజేశామని తెలిపారు. రైతుభరోసా కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రైతుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌ నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నారు.‘‘వ్యవసాయం దండగ కాదు.. పండుగ అనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ నీటి వాటాను ఏపీకి అప్పగిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. బనకచర్ల బంకను మా ప్రభుత్వానికి రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తాం. గోదావరి జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. గోదావరి జలాల విషయంలో జులై మొదటి వారంలో కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినిపిస్తాం. కాళేశ్వరంపై ఈనెల 30లోపు కమిషన్‌కు పూర్తి వివరాలు ఇవ్వాలని నిర్ణయించాం. కాళేశ్వరానికి గత ప్రభుత్వ మంత్రివర్గ ఆమోదం ఉందా? లేదా? వివరాలు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని పొంగులేటి వివరించారు. నూతన క్రీడా పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్రీడా కోటాలో రిజర్వేషన్లు పెంచాలని, క్రీడాకారులను ప్రోత్సహించేలా పారితోషికాలు ఇవ్వాలని నిర్ణయించింది.

తాజావార్తలు