చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కోర్టుకు జగన్‌ తరలింపు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి కోర్టు వరకు భారీ బందోబస్తు చేపట్టారు. ఈ కేసులో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డిలను కూడా కోర్టుకు తరలించారు.