చిట్టాపుర్ లో ఘనంగా, వజ్రోత్సవ ర్యాలీ

మల్లాపూర్ (జనం సాక్షి ) ఆగస్టు :13
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గ్రామ సర్పంచ్ కడకుంట్ల సాయాబు గారి ఆధ్వర్యంలో
భరత మాత విగ్రహం నుండి శివాజీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.. ఇట్టి కార్యక్రమం లో గ్రామ ప్రజలు భారీగా తరలి వచ్చి తమ దేశ భక్తి ని చాటారు.ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయాబు, ఎంపీటీసీ లక్ష్మి,ఉప సర్పంచ్ నవీన్, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్,నాయకులు నూతుల లక్ష్మినారాయణ మరియు సెక్రెటరీ ప్రవీణ్, హెడ్మాస్టర్స్ శ్రీనివాస్, మెల్కియార్ రెడ్డి లు, అంగన్వాడీ టీచర్లు ఆశావర్కర్లు గ్రామ వివోఏలు మహిళ సంఘాలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు