జాతీయ గీతం జనగణమన కాదు.. వందేమాతరమే!

5
– జాతీయ జెండాతో సమానంగా కాశాయ జెండాను గౌరవించాలి

– మళ్లీ ఆర్‌ఎస్‌ఎస్‌ వివాదస్పద వ్యాఖ్యలు

ముంబయి,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): ఆర్‌ఎస్‌ఎస్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తూనే ఉంది.’భారత్‌ మాతా కీ జై’ నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారకముందే ఆర్‌ఎస్‌ఎస్‌ కు చెందిన మరో నేత సరికొత్త వివాదానికి తెరలేపారు. హిందూత్వకు ప్రతీక అయిన

కాషాయ జెండాను జాతీయ పతాకంతో సమానంగా గౌరవించాలన్నారు.ముంబైలోని  దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ రీసెర్చ్‌ ఇన్స్‌టిట్యూట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో

పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ భయ్యాజీ జోషీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత జాతీయ గీతంగా రాజ్యాంగం ‘జనగణమన’ను పేర్కొంటున్నా నిజమైన జాతీయ

గీతం అది కాదంటున్నారు ఆర్‌ఎస్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ భయ్యాజీ జోషీ అన్నారు.

జాతీయ జెండాతో సమానంగా కాశాయ జెండాను గౌరవించాలి

కాషాయ జెండాను జాతీయ పతాకంతో సమానంగా గౌరవిచడంలో తప్పులేదని, రెండు జెండాలకు మధ్య పెద్దగా తేడా లేదన్నారు జోషి. మూడు రంగుల జెండా రూపొందించకముందు బ్రీటిష్‌ పాలనకు వ్యతిరేకంగా కాషాయ జెండాను ఎగురవేసేవారని గుర్తుచేసిన ఆయన జాతీయ గేయమైన ‘వందేమాతరం’ను కూడా జాతీయ గీతంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు.’రాజ్యాంగం ప్రకారం జాతీయ గీతం అయిన ‘జన గణ మన’కు మనం కచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అదే విధంగా సంపూర్ణ అర్థాన్ని బట్టి చూస్తే వందేమాతరం జాతీయగీతమే’ అని జోషి అన్నారు. కాగా, జోషి వ్యాఖ్యలపై జేడీయూ (జనతాదళ్‌ యునైటెడ్‌) మండిపడింది. కశ్మీర్‌ వేర్పాటువాదులకు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలకు పెద్దగా తేడాలేదని, కశ్మీర్‌ వేర్పాటువాదులలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా  మూడురంగుల జెండాకు గౌరవం ఇవ్వదని, జోషీ వ్యాఖ్యలు జాతీయ జెండాను అవమానించేలా ఉన్నాయని జేడీయూ నేతలు మండిపడ్డారు. ముంబయిలోని దీన్‌దయాళ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన మాట్లాడుతూ వందేమాతరమే భారతీయుల జాతీయగీతం అని పేర్కొన్నారు.’రాజ్యాంగం ప్రకారం జనగణమన మన జాతీయ గీతం. కాబట్టి దాన్ని అంతా గౌరవించాల్సిందే. అయితే అందులో మరెలాంటి సెంటిమెంట్‌ లేదు. అయితే జనగణమన, వందేమాతరం రెండు గేయాల్లోని భావాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే వందేమాతరమే నిజమైన జాతీయ గీతం అనిపిస్తుంది. బంకించంద్ర చటర్జీ రాసిన వందేమాతరంలో మాతృదేశం గురించి, జాతి వ్యక్తిత్వం, శైలి గురించి గొప్పగా రాశారు. స్వాతంత్రోద్యమ సమయంలో వందేమాతరం ప్రముఖ పాత్ర పోషించింది’ అని ఆయన వివరించారు.