టిడిపి అధినేత పర్యటన ను జయప్రదం చేయండి

 – సిరిశెట్టి కమలాకర్
  కరకగూడెం, జులై (జనంసాక్షి):     తెలుగుదేశం పార్టీ అధినేత  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురు శుక్ర వారాలలో ముంపుకు గురైన భద్రాచలం, పినపాక నియోజకవర్గ ల్లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు .కావున పినపాక నియోజకవర్గ తెదెపా కార్యాకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కరకగూడెం మండల అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం ను ప్రతీ ఏడాది అతలాకుతలం చేస్తున్న వరదలను నివారించడానికి భారీ కరకట్ట నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. కావున కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈకార్యక్రమంలో రాధాకృష్ణ వీరయ్య సత్యనారాయణ.తదితరులు పాల్గొన్నారు.
Attachments area