స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్‌ టి. మాధవిదేవి తీర్పు వెలువరించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ 60 రోజుల సమయం కోరగా ఈసీ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. అలాగే రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం 30 రోజుల సమయం కోరగా ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా కోర్టు అంగీకరించింది.