నీటి వాటాలో కేసీఆర్‌ మరణశాసనం రాశారు

` తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో అసెంబ్లీలో తేలుద్దాం
` పుట్టెడు అప్పులు మా నెత్తిన పెట్టి వెళ్లారు
` కేసీఆర్‌ కుటుంబం రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిరది
` తెలంగాణ వాటాను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారు
` బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలనపై చర్చ పెట్టాలి
` రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి

(‘‘గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు కేసీఆర్‌ సిద్ధమా? అసెంబ్లీలో చర్చ కోసం స్పీకర్‌కు లేఖ రాయాలి. కేసీఆర్‌ చెప్పిన తేదీన అసెంబ్లీలో చర్చ బాధ్యత శ్రీధర్‌బాబు తీసుకుంటారు. ఆధారాలు, సంతకాలతో అసెంబ్లీలో చర్చకు వస్తా మీరు సిద్ధమా? అన్ని వివరాలతో అసెంబ్లీలో చర్చకు సిద్ధం కేసీఆర్‌ సిద్ధమా? ఒకరోజు గోదావరి జలాలు, రోజు కృష్ణా జలాలపై చర్చిద్దాం.’’ రేవంత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి)

హైదరాబాద్‌(జనంసాక్షి):రైతుభరోసాను విజయవంతంగా పూర్తి చేశామని, 70లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9వేల కోట్లు వేశామన్నారు. రైతుల ఆశీర్వాదం వల్లనే తాను చిన్న వయసులోనే సీఎం అయ్యానని చెప్పారు. వ్యవసాయాన్ని దండగ అనే స్థాయి నుంచి పండగ చేసేందుకే వైఎస్సార్‌ ఆనాడు ఉచిత విద్యుత్‌ అందించారని గుర్తు చేశారు. రైతుల అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం ఇవాళ్టితో పూర్తయింది. 9 రోజుల్లో 9 వేల కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతుభరోసా కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌?లోని సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మా ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యం రైతులేనని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అన్నదాతల తరువాత మహిళలు, యువత మా ప్రాధాన్యమని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చామని, నిలబెట్టుకున్నామని అన్నారు. 25 లక్షల మందికిపైగా అన్నదాతలకు రుణమాఫీ చేశామని, గత సీఎం కేసీఆర్‌ వరి వేసుకుంటే ఉరి వేసుకోవడమే అని చెప్పారని, మా ప్రభుత్వం వచ్చాక సన్నవడ్లు పండిస్తే బోనస్‌ ఇస్తామని చెప్పామని గుర్తు చేశారు. అంతేకాకుండా 48 గంట్లలో నగదు జమ చేశామని అన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిరచే రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పుకొంటున్నామని, వ్యవసాయం అంటే అన్నదాతను రాజును చేయడమని పేర్కొన్నారు. మాజీ సీఎం రూ.8 లక్షల కోట్లకుపైగా అప్పులు మా నెత్తిన పెట్టి వెళ్లారని ఆరోపించారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టడం కూలడం కూడా జరిగిపోయిందని విమర్శించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తే వాళ్లంతా ఎలా సంపన్నులయ్యారని నిలదీశారు. కేసీఆర్‌ వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూత వేయించారని ఆరోపించారు. కానీ, మేము అధికారంలోకి వచ్చిన తరువాత 60,000 జాబ్స్‌ ఇచ్చామని అన్నారు. గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకువచ్చామని వెల్లడిరచారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రాజెక్టులను బీఆర్‌ఎస్‌ పూర్తి చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం కట్టిన మూడేళ్లకే కూలేశ్వరమైందని, రూ.లక్ష కోట్లు గంగలో కొట్టుకుపోయాయాయని, కాళేశ్వరం గోదావరిలో కొట్టుకుపోవడానికి కారణం కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబం రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిరదని ఆరోపించారు. నాణ్యత, ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కూలాయని, ప్రాజెక్టులు కూలినందుకు చిన్న కాళేశ్వరంలో కేసీఆర్‌ను ఉరితీసినా తప్పులేదని రైతులంటున్నారని అన్నారు.బనకచర్ల ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు నీళ్లు ఇస్తున్నామని ఆరోపిస్తున్నారని సీఎం రేవంత్‌ అన్నారు. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు కేసీఆర్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చ కోసం స్పీకర్‌కు లేఖ రాయాలని కోరారు. తెలంగాణ ద్రోహులెవరో గోదావరి జలాల దొంగలెవరో అసెంబ్లీలో తేలుద్దామని వెల్లడిరచారు. కేసీఆర్‌ చెప్పిన తేదీన అసెంబ్లీలో చర్చ బాధ్యత శ్రీధర్‌బాబు తీసుకుంటారని, ఆధారాలు, సంతకాలతో అసెంబ్లీలో చర్చకు వస్తా మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. ఒకరోజు గోదావరి జలాలు, రెండో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దామని తెలిపారు.శాశ్వతంగా తెలంగాణకు మరణశాసనం రాసింది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ రైతులకు మరణశాసనం రాసింది కేసీఆర్‌ కాదా అని విమర్శించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకుని ముఖం చెల్లక ఫాంహౌస్‌లో ఉన్నారని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ చచ్చిన పామని ఎద్దేవా చేశారు. గోదావరి జలాల సెంటిమెంట్‌తో మంటలు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బనకచర్లపై ప్రణాళికలు రచించినప్పుడే కేంద్రానికి ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం ధ్యేయమని, మహిళలు సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌పై విద్యుత్‌శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మహిళలకు రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆదుకున్నామని అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయానికి చర్యలు చేపట్టామని, శిల్పారామంలో 150 షాపుల ఏర్పాటుకు స్థలం కేటాయించామని తెలిపారు. 1000 బస్సులు కొని ఆర్టీసీకి మహిళలు అద్దెకు ఇచ్చేలా చర్యలు చేపట్టామని, 8,000 ఐకేపీ కేంద్రాలను మహిళల చేతుల్లో పెట్టామని, పాఠశాలల్లో ఆహార పదార్థాల సరఫరా బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించామని, పది సంవత్సరాల బీఆర్‌ఎస్‌ పాలన, 18 నెలల కాంగ్రెస్‌ పాలనపై చర్చ పెట్టాలని డిమాండ్‌ చేశారు.

 

 

పనిచేస్తేనే పదవులు
` పార్టీ నిర్మాణంలో కార్యకర్తలు క్రియాశీల పాత్ర పోషించాలి
` త్వరలో మార్కెట్‌, టెంపుల్‌ కమిటీల్లో నామినేషన్‌ పోస్టులు భర్తీ
` పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తాయి
` జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలి
` రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు
` ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
` పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు తెలిపారు. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌, జమిలి ఎన్నికల వంటి అనేక అంశాలు రాబోతున్నట్లు చెప్పారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం మాట్లాడారు. త్వరలో మార్కెట్‌, టెంపుల్‌ కమిటీల్లో నామినేషన్‌ పోస్టులు భర్తీ చేయాలన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని చెప్పారు.‘’మరోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేలా పని చేయాలి. బూత్‌, గ్రామ, మండలస్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. పార్టీ కమిటీ నాయకులు క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాలు నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలి. నేను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తాయి’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.‘’ కులగణన చేసి మోదీ ప్రభుత్వానికి సవాల్‌ విసిరాం. కేంద్రం కూడా జనగణనతోపాటు కులగణన చేసే పరిస్థితికి తీసుకువచ్చాం. ఎస్సీ వర్గీకరణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ తీసుకువస్తున్నాం. పార్టీ నిర్మాణంలో కార్యకర్తలు క్రియాశీల పాత్ర పోషించాలి. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రియాశీలంగా ఉండాలి. పార్టీ పదవిని కార్యకర్తలు చిన్నచూపు చూడవద్దు. పదవుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కార్యకర్తలకే తీరని నష్టం’’ అని సీఎం అన్నారు. పదేళ్లపాటు తెలంగాలో కాంగ్రెస్‌దే అధికారమని, మరోమారు అధికారంలోకి తీసుకుని వచ్చేలా పార్టీనేతలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారు బాధ్యతలు తీసుకోవాలని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గత 18 నెలల కాంగ్రెస్‌ పాలన నిజంగానే గోల్డెన్‌ పీరియడ్‌ అన్నారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు తెలిపారు. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌, జమిలి ఎన్నికల వంటి అనేక అంశాలు రాబోతున్నట్లు చెప్పారు. గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం మాట్లాడారు. త్వరలో మార్కెట్‌, టెంపుల్‌ కమిటీల్లో నామినేషన్‌ పోస్టులు భర్తీ చేయాలన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని చెప్పారు.‘మరోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేలా పని చేయాలి. బూత్‌, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. పార్టీ కమిటీ నాయకులు క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాలు నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలని సూచించారు. నేను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో కులగణన చేసి మోదీ ప్రభుత్వానికి సవాల్‌ విసిరాం. కేంద్రం కూడా జనగణనతోపాటు కులగణన చేసే పరిస్థితికి తీసుకువచ్చాం. ఎస్సీ వర్గీకరణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ తీసుకువస్తున్నాం. పార్టీ నిర్మాణంలో కార్యకర్తలు క్రియాశీల పాత్ర పోషించాలి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రియాశీలంగా ఉండాలి. పార్టీ పదవిని కార్యకర్తలు చిన్నచూపు చూడవద్దు. పదవుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కార్యకర్తలకే తీరని నష్టం అని సీఎం అన్నారు. రానున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ ఉప ఎన్నికలో గెలవాల్సిందే అని ఏఐసీసీ ఇంఛార్జ్‌ విూనాక్షీ నటరాజన్‌ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌ ఎన్నిక కోసం గ్రేటర్‌ పరిధిలోని నాయకులందరినీ సమన్వయం చేయాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. ఇక.. అభ్యర్థి ఎంపికకు సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. తామే అభ్యర్థులమంటూ కొంతమంది తేల్చిచెబుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి దీనిపై స్పష్టత ఇచ్చారు. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదని చెప్పారు. అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని సీఎం ఆదేశించారు. ఏ ఎన్నిక జరిగినా ఒకే పక్రియ ప్రకారం అభ్యర్థి ఎంపిక ఉంటుందని, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అదే పక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. పదవులు వచ్చిన వాళ్ళు రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఇక.. పీఏసీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హాట్‌ హాట్‌ చర్చ జరిగింది. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రులు కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో తమపై ఒత్తిడి పెరుగుతోందని స్పష్టం చేశారు. ప్రతి చిన్న పనికి మంత్రుల వద్దకు రావడంతో పని భారం పెరుగుతోందని వారు చెప్పుకొచ్చారు. మరోవైపు నిన్న గాంధీ భవన్‌లో గొర్రెలతో నిరసన చేయడంపై సీఎం చాలా సీరియస్‌ అయ్యారు. గాంధీ భవన్‌లో ఇలాంటివి ఎంటర్‌ టైన్‌ చేయొద్దని ఆదేశించారు. నిరసనకు ఓ పరిమితి ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ అందరి అభిప్రాయం తీసుకుంటుందని.. అందరినీ గౌరవిస్తుందన్నారు. ఇది పార్టీ ఆఫీసా ఇంకా ఏమైనానా అని గాంధీభవన్‌ ఆఫీస్‌ బేరర్స్‌ను ప్రశ్నించారు. ఇష్టా రీతిలో నిరసనలు చేస్తుంటే ఏం చేస్తున్నారు అని సీఎం ప్రశ్నించారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని సీఎం హెచ్చరించారు. అలాగే ఇంచార్జ్‌ మంత్రుల పనితీరుపై కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో నామినేటెడ్‌ పదవులు భర్తీ చేసే భాధ్యత ఇంచార్జ్‌ మంత్రులకు అప్పగించినా చేయడం లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం గెలిచేలా ఇంచార్జ్‌ మంత్రులే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రుల దగ్గర ఫండ్స్‌ పెట్టామని, వాటిని సరిగ్గా ఉపయో గించడం లేదని పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో విూనాక్షి నటరాజన్‌, పిసిసి చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

 

 

2.నేడు తేలనున్న ‘పంచాయతీ’
` తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలపై తీర్పు ఇవ్వనున్న హైకోర్టు
హైదరాబాద్‌(జనంసాక్షి): గ్రామపంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటీషన్లపై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. బుధవారం తీర్పు వెలువడనుండటంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.ఏడాదిన్నరగా ఎన్నికలు నిర్వహించకుండా : 2024 జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌? పదవీకాలం ముగిసిన అభ్యర్థులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ టి.మాధవిదేవి విచారణ నిర్వహించారు. ఫిభ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా తేదీలు వెల్లడిస్తామని, ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.60రోజుల సమయం కావాలి : ఏడాదిన్నర పంచాయతీలో సరైన పాలన లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాదించారు. పంచాయతీలకు పాలకవర్గం లేకుండా ఉండొద్దని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయన్నారు. గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని నిబంధనలున్నా అమలు చేయడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజుల గడువు కావాలని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం వెలువర్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి 60రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.