ముగిసిన యుద్ధం

` ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రకటనను అంగీకరించిన ఇరాన్‌,ఇజ్రాయెల్‌
` నాటకీయ పరిణామాల అనంతరం శాంతించిన ఇరుదేశాలు
(రోజంతా హైడ్రామా
` క్షణానికో మలుపు తిరిగిన ఉద్రిక్తతలు
` కాల్పుల విరమణ జరిగిందంటూ ట్రంప్‌ ప్రకటన శ్రీఅనంతరం తమపై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగించిదన్న ఇజ్రాయెల్‌
` దాడులకు గట్టిగా స్పందిస్తామన్న నెతన్యాహు
` తామెలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేసిన ఇరాన్‌
` తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించి యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ వార్నింగ్‌
` అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలతో వెనక్కు తగ్గిన ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు
న్యూయార్క్‌,టెల్‌అవీవ్‌,టెహ్రాన్‌(జనంసాక్షి):
ఇరాన్‌,ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికో మలుపు తిరిగి చివరకు ఇరు దేశాలు శాంతించాయి. అంతకుముందు ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినప్పటికీ.. ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున టెల్‌ అవీవ్‌ను లక్ష్యంగా చేసుకొని టెహ్రాన్‌ క్షిపణులు ప్రయోగించింది. దీంతో పలుచోట్ల సైరన్ల మోత మోగింది. ఇరాన్‌ క్షిపణులు తమ దేశం వైపు దూసుకొస్తున్నాయని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్‌ మిలిటరీ ప్రజలను హెచ్చరించింది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ క్షిపణులు ప్రయోగించినట్లు ఐడీఎఫ్‌ వెల్లడిరచింది. జెరూసలెం, బీర్‌షెబా ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల కారణంగా బీర్‌షెబాలోని ఓ భవనం తీవ్రంగా దెబ్బతింది. అందులోని ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. కాగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక కథనాలు వెల్లడిరచాయి. ఇప్పటివరకు ఇరాన్‌ 6 క్షిపణులను ప్రయోగించినట్లు ఐడీఎఫ్‌ వెల్లడిరచింది. టెహ్రాన్‌ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4 గంటల తర్వాత ఈ క్షిపణులను ప్రయోగించింది. అంతకుముందు ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పందిస్తూ.. తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని తెలిపిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల్లోపు టెల్‌అవీవ్‌ దాడులు ఆపితేనే.. తాము కూడా సంఘర్షణలను నిలువరిస్తామని ఆయన తెలిపారు. ఈ పోస్ట్‌ చేసిన కొన్ని గంటలకే ఇరాన్‌ మళ్లీ దాడులు చేయడం గమనార్హం. అటు ఇజ్రాయెల్‌ కూడా ప్రతిదాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టెహ్రాన్‌లోనూ సైరన్‌ శబ్దాలు వినిపిస్తున్నాయి.ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందన్నారు. అయితే, ఈ ప్రకటనపై తొలుత విరుద్ధ ప్రకటన చేసిన ఇరాన్‌.. ఆ తర్వాత ఒప్పందానికి సుముఖత వ్యక్తంచేస్తున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. మరోవైపు, ఇజ్రాయెల్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇజ్రాయెల్‌- ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కాల్పుల విరమణ కుదిరినప్పటికీ ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇరాన్‌, ఇజ్రాయెల్‌లు కాల్పుల విరమణను ఉల్లంఘించాయన్నారు. ఈ క్రమంలో తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు.ఇజ్రాయెల్‌.. ఆ బాంబులను వేయొద్దు. అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనే. మీ పైలట్లను తక్షణమే వెనక్కి రప్పించండి’’ అని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ తరఫున ఇరాన్‌పై ఇటీవల దాడులు చేసిన ట్రంప్‌.. గత రెండు వారాల్లో మిత్రదేశానికి ఇలా సూటి హెచ్చరికలు చేయడం ఇదే తొలిసారి. ది హేగ్‌లో జరిగే నాటో సదస్సుకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాలు పరస్పరం మళ్లీ దాడులు చేసుకున్న విషయాన్ని ధ్రువీకరించారు. ‘’ఇరాన్‌తోపాటు ఇజ్రాయెల్‌ కూడా కాల్పుల విరమణను ఉల్లంఘిచింది. ఇజ్రాయెల్‌ చర్యపట్ల నేను సంతోషంగా లేను. టెల్‌ అవీవ్‌ శాంతించాలి. అదే నేను కోరుకుంటున్నా’’ అని స్పష్టం చేశారు.కొన్ని గంటలకే ట్రంప్‌ మరో ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేయబోదన్నారు. అన్ని విమానాలు తిరిగి వెనక్కి వచ్చేస్తాయన్నారు. కాల్పుల విరమణ కొనసాగుతోందని.. ఎవ్వరికీ గాయాలు కాలేదన్నారు. ఇరాన్‌ ఎప్పటికీ అణు కేంద్రాలను పునర్మించుకోలేదని ఈ సందర్భంగా ట్రంప్‌ స్పష్టం చేశారు.
గత 12 రోజులుగా ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ల మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. తాజాగా ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే టెహ్రాన్‌ దాన్ని ఉల్లంఘించి, తమపై క్షిపణులతో దాడులకు దిగిందని టెల్‌అవీవ్‌ ఆరోపించింది. దీనికి తాము గట్టిగా బదులిస్తామని హెచ్చరించింది. ఒప్పందం కుదిరిన రెండు గంటలకే తమ గగనతలం పైకి ఇరాన్‌ నుంచి బాలిస్టిక్‌ క్షిపణులు రెండు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్‌) పేర్కొంది. ఈనేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్‌లు కూడా మోగాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌పై గట్టిగా స్పందించాలని తాను ఐడీఎఫ్‌కు ఆదేశించానని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ పేర్కొన్నారు. టెహ్రాన్‌కు అతి ముఖ్యమైన ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేయాలని పేర్కొన్నట్లు వెల్లడిరచారు. కాగా.. కాల్పుల విరమణకు అంగీకరించినా.. ఇరాన్‌ నుంచి సైనిక ముప్పు పొంచి ఉందని టెల్‌అవీవ్‌ రక్షణాధికారి ఈ దాడులకు ముందు వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలో తమ వైమానిక దళాన్ని, సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగనుందని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్‌ దీనిపై స్పందించిన తీరు గందరగోళానికి దారితీసింది. ఇంకా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోలేదని చెబుతూనే.. సైనిక కార్యకలాపాలు ముగిశాయని అర్థం వచ్చేలా పేర్కొంది. దీని తర్వాత ఇరుదేశాల మధ్య దాడులు జరిగాయి. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఇరాన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌ కూడా ట్రంప్‌ ఒప్పందాన్ని అంగీకరించినట్లు వెల్లడిరచింది.అంతకు ముందు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్షణక్షణానికో మలుపు తిరుగుతున్నాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినప్పటికీ..ఇంకా ఘర్షణలు కొనసాగాయి. ఈ క్రమంలోనే ఇరాన్‌ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం మొదలైనట్లు అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు టెహ్రాన్‌ అధికారిక మీడియా వెల్లడిరచింది.అటు ట్రంప్‌ కూడా దీనిపై స్పందించారు. ‘’కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దయచేసి దాన్ని ఉల్లంఘించొద్దు’’ అని అమెరికా అధ్యక్షుడు తన ట్రూత్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు కొన్ని గంటల క్రితం ట్రంప్‌ వెల్లడిరచిన సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియ ఎలా జరగనుందనే దాన్ని కూడా ఆయన అందులో వివరించారు.‘’ఇప్పటినుంచి దాదాపు ఆరు గంటల తర్వాత ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పరస్పరం తుదివిడత దాడులు పూర్తి చేసుకొని కాల్పుల విరమణ ఒప్పందానికి వస్తాయి. తొలుత అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత (అమెరికా కాలమానం ప్రకారం) ఇరాన్‌ కాల్పుల విరమణను మొదలు పెట్టాల్సిఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) నుంచి ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణను మొదలుపెడుతుంది. అలా 12 గంటలు ముగిసిన తర్వాత 12 రోజుల యుద్ధానికి అధికారిక ముగింపు లభిస్తుంది. ఈ ఒప్పందం అమల్లో ఉన్న వేళ పరస్పరం శాంతియుతంగా, గౌరవ ప్రదంగా వ్యవహరించాలి’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అన్నట్లుగానే ఇరాన్‌ తొలుత కాల్పుల విరమణను ప్రకటించింది. ఇక్కడి నుంచి 12 గంటల తర్వాత ఇజ్రాయెల్‌ కూడా దీన్ని పాటించాల్సి ఉంటుంది. అయితే, తాజా పరిణామాలపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.కాల్పుల విరమణ కోసం ట్రంప్‌ ప్రాధేయపడ్డారు: ఇరాన్‌ ప్రభుత్వ మీడియా
చివరి క్షణం వరకు దాడులే..
అయితే, కాల్పుల విరమణను ప్రకటించడానికి చివరి నిమిషం వరకు టెహ్రాన్‌ దాడులకు పాల్పడిరది. పలు దఫాలుగా ఇజ్రాయెల్‌ పైకి క్షిపణులు ప్రయోగించింది. దీని కారణంగా బీర్‌షెబాలోని ఓ భవనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. పలువురు గాయపడినట్లు ఐడీఎఫ్‌ వెల్లడిరచింది.ఈ కాల్పుల విరమణ ఒప్పందం గురించి తొలుత ఇరాన్‌ చేసిన ప్రకటనలు గందరగోళానికి గురిచేశాయి. తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని, ఇజ్రాయెల్‌ దాడులు ఆపితేనే తామూ ఆపేస్తామని టెహ్రాన్‌ విదేశాంగ మంత్రి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత కాసేపటికే.. టెల్‌అవీవ్‌పై టెహ్రాన్‌ సైనిక కార్యకలాపాలు ముగిశాయని అర్థం వచ్చేలా పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ సాయుధ దళాలు చివరివరకు శక్తిమంతమైన పోరాటం కొనసాగించాయని చెబుతూ.. కాల్పుల విరమణకు సిద్ధమేనన్న సంకేతాలిచ్చారు.