హుజూర్ నగర్, కోదాడలో రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన
హైదరాబాద్ (జనంసాక్షి) : రేపు జనపహాడ్, బెట్టెతండాలో జరుగుతున్న ఎల్ఐ పనులను పరిశీలించడానికి హెలికాప్టర్లో రానున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలంలోని ఆర్ అండ్ బి, పిఆర్ రోడ్లకు శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నట్టు పేర్కొన్నారు. హుజూర్నగర్లో కొత్త జూనియర్, డిగ్రీ కళాశాలలకు కూడా శంకుస్థాపనలు, కోదాడలో జరుగుతున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలన, కొనసాగుతున్న ఎంబిసి, రాజీవ్ గాంధీ లిఫ్ట్ పథకాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలలో ఇలాంటి ఇతర కార్యక్రమాలకు కూడా హాజరు కానున్నట్టు తెలిపారు.