టిడిపి పులిచంతల సందర్శనకు పోలీసుల బ్రేక్‌

గుంటూరు,ఆగస్ట్‌9(జనంసాక్షి): పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతల బృందం వెళ్లింది. టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పులిచింతలకు బృందం వెళ్లింది. మాదిపాడు దగ్గర టీడీపీ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు నలుగురికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇటీవల పులిచింతల గేª`టలు దెబ్బతినడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. దీనిని సందర్శించాలని టిడిపి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు.