– టిి ఎన్ టిి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు.

బూర్గంపహాడ్ జూలై (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టి ఎన్ టి యు సి యూనియన్ ప్రెసిడెంట్ కనకమేడల హరిప్రసాద్ అధ్యక్షతన సమావేశమయ్యారు.
28.07.2022 న సాయంత్రం 4.00 గంటలకు తెలుగుదేేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బూర్గంపహాడ్ మండల కేంద్రం చేరుకొని మండలం లోని ముంపు ప్రాంతాలను సందర్శించి వివరాలు అడిగిి తెలుసుకోనున్నారు. వరద బాధితుల పరిస్థితుల గురించి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కు వివరిస్తారని అన్నారు. ఈ సమావేశం లో రాష్ట్ర టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ…ప్రస్తుత గోదావరి వరద వలన భద్రాచలం కు ముప్పు తప్పింది అంటే అది మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్మించిన భద్రాచల కరకట్ట వల్లే అని గుర్తుచేశారు. అనంతరం టి ఎన్ టి యు సి అధ్యక్షులు కనకమేడల హరిప్రసాద్ మాట్లాడుతూ… ఇలాంటి క్లిష్ట పరిస్తితులలో స్థానిక ఐ టి సి యాజమాన్యం సహాయ సహకరాలలో తమవంతు పాత్ర పోషించడం పై హర్శం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ నాయకులు వట్టం నారాయణ దొర, మహబూబాబాద్ పార్లమెంట్ పార్టీ నాయకులు వాసిరెడ్డి చలపతిరావు, మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరి జగదీశ్వరరావు, మండల తెలుగు యువత అధ్యక్షులు నెట్టెం భాస్కర్, టి ఎన్ టి యు సి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area