టేకులపల్లి గ్రామ సమీపంలో జీపును లారీ ఢీకోట్టింది

మరికల్‌ (మహబూబ్‌నగర్‌) : మక్తల్‌ మండలం టేకులపల్లి గ్రామ సమీపంలో జీపును లారీ ఢీకోట్టింది. ఈప్రమాదంలో ఎం.డి మౌలాలీ, రఫీ ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ మరికల్‌ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.మక్తల్‌ నుంచి మౌలాలీ, రఫీ జీపులో మరికల్‌ వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకోట్టడంతో దుర్గటన జరిగింది.