దేశంలో కొనసాగుతున్న కరోనా కలకలం


స్వల్పంగా పెరిగిన పాజిటివ్‌ కేసులు
కొత్తగా 42982 కేసులు నమోదు

న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): భారతదేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో రోజూవారీగా నమోదవుతున్న కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 42982 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31812114 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 411076 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 30974748 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే నిన్న 533 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 426290కి చేరింది. అటు బుధవారం 41726 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1.29 శాతంగా ఉండగా.. రికవరీ రేట్‌ 97.37 శాతంగా ఉంది. మరోవైపు నిన్న ఒక్క రోజులో 3755115 మందికి టీకా వేయగా.. ఇప్పటిదాకా 489342295 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు 51.01 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో ఇప్పటిదాకా పంపిణీ అయిన వృధా అయిన టీకాల మొత్తం 486015232గా ఉందని వెల్లడిరచింది. కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ ప్రతి రోజు 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న 22414 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో 6126 మంది కరోనా బారినపడ్డారు. బుధవారం దేశవ్యాప్తంగా 1664030 మందికి కరోనా పరీక్షలు చేశారు. 3755115 డోసుల వ్యాక్సిన్‌ వేశారు. మన దేశంలో ఇప్పటి వరకు 489342295 డోసుల టీకాలు వేశారు.