నదీమ్‌కు భారీగా స్వాగతం

అనంతపురం,ఆగస్టు7(జనంసాక్షి): అనంతపురంలో వైసీపీ నేత హంగామా చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడవిూ చైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌ భారీ ర్యాలీ, ఊరేగింపు నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో టపాసులు పేలుస్తూ డీజే సాంగ్స్‌తో హంగామా చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు
పట్టించుకోకపోవడంపై స్థానిక దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజలపై మాత్రం జరిమానాలు వేస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.