నేతన్న నేస్తం ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ది


వరుసగా మూడో ఏడాది నేతన్నలకు ఆర్ధిక సాయం
అర్హులైనవారు పేర్లు నమోదు చేసుకోవాలి
నిధులను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసిన సిఎం జగన్‌
అమరావతి,ఆగస్ట్‌10(జనం సాక్షి): ’వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం’ ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ది చేకూరు తుందని సిఎం జగన్‌ అన్నారు. తన పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశానని, ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్ధిక సాయం చేస్తున్నామని సీఎం అన్నారు. వరుసగా మూడో ఏడాది నేతన్న నేస్తం ద్వారా ఆర్ధిక సాయం చేస్తున్నామని అన్నారు. భవిష్యత్‌లో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నట్లు వెల్లడిరచారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ’వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ అమలు చేసింది. ’వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని,
మూడో విడత కింద రూ.192.08 కోట్లు జమ చేస్తున్నామ్నారు. . దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేతలకు ఆర్ధిక సాయం అందిస్తున్నాం. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24వేల చొప్పున సాయం చేస్తున్నాం. ఆప్కో ద్వారా ఈ`మార్కెటింగ్‌ తీసుకొచ్చామని సీఎం జగన్‌ అన్నారు. మగ్గం కలిగిన, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఐదేళ్లలో ప్రతి లబ్దిదారుడికి రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే 2 విడతల్లో సాయం అందగా తాజాగా మూడో విడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందచేసింది. మంగళవారం మూడో విడత కింద ఇచ్చిన రూ.192.08 కోట్లతో కలిపితే నేతన్నలకు రూ.576.07 కోట్ల సాయం అందించినట్లయిందన్నారు. వైయస్సార్‌ నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన నేతన్నలకు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం కోసం రూ.192 కోట్లు జమచేస్తున్నామని పేర్కొన్నారు. మగ్గంవిూద బతుకుతున్న చేనేత కుటుంబానికి అక్షరాల రూ.24వేల ఆర్థిక సహాయాన్ని చేస్తున్నామని..2 సంవత్సరాల 2 నెలల్లో వరుసగా మూడో విడత నేతన్న నేస్తం డబ్బులు విడుదల చేస్తున్నామని వెల్లడిరచారు. ఈ సొమ్ముతో మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు కన్నా చేనేతలు బతకడానికి పడుతున్న ఇబ్బందులు ఎక్కువ అని భావించి.. ఈ 80వేల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు.ఇలా ఏటా దాదాపుగా రూ.200 కోట్లు చొప్పున 5 ఏళ్లకాలంలో రూ.1000 కోట్ల రూపాయలు కేవలం నేతన్న నేస్తం ద్వారానే ఇస్తున్నామని వివరించారు