పరిచయం లేకున్నా ఎందుకనో జలసీ

ట్రోలర్లకు ఘాటుగా సమాధానమిచ్చిన సుస్మిత
కొన్నిరోజులుగా లలిత్‌ మోదీ`సుస్మితాసేన్‌ అజరామార ప్రేమ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారిన సంగతి తెలిసిందే. 46 ఏళ్ల సుస్మిత తనకన్నా 12 ఏళ్లు వయసులో పెద్దవాడైన లలిత్‌ మోదీని ప్రేమించడంపై ఎవరికి వారు భిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా సుస్మితాసేన్‌ ట్రోలర్లకి టాª`గ్గంªట్‌ అయింది.పాత ప్రేమ కథలు…బ్రేకప్‌ స్టోరీలు బయటకు తీసి మరి విమర్శలు గుప్పిస్తున్నారు. కొత్తగా లలిత్‌తో ప్రేమ కహాని కేవలం డబ్బు కోసమనేనని….సర్వ సుఖాలు డబ్బుతో ముడిపడినవి కాబట్టే వయసులో పెద్దోడ్ని తగులుకుందని కామెంట్లు సహా ట్రోలింగ్‌ చేస్తున్నారు. సుస్మితని ’గోల్డ్‌ డిగ్గర్‌’ అంటూ కామెంట్లు చేసారు.‘సుస్మితా సేన్‌ లో ప్రేమను కనిపెట్టా‘ అంటూ లలిత్‌ మోదీ ఇన్‌ స్టాలో చెప్పడం మరింత సంచలనమవుతుంది. ఆ పాయింట్‌ పై ట్రోలర్ల దాడి మామూలుగా లేదు. ఈ అంశంపై రకరకాల కామెంట్లు..వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఈ విమర్శలకి..ట్రోలర్ల కి సుస్మితాసేన్‌ ధీటైన
సమాధానం ఇచ్చింది.‘చుట్టూ ఉన్న ప్రపంచం దయనీయంగా మారుతుంది. అది చూస్తుంటే చాలా బాధగా ఉంది. కొంత మంది మేధావులు..గాసిప్స్‌ క్రియేట్‌ చేసేవారు.. అమాయకులు.. నన్ను కలవని స్నేహితులు.. పెద్దగా పరిచయం లేని వ్యక్తలు ఇలా అంతా ఒకేసారి నా వ్యక్తిత్వంపై అమూల్యమైన అభిప్రాయాలు చెప్పుకొస్తున్నారు. నన్నొక గోల్డ్‌ డిగ్గర్‌ అంటున్నారు. డబ్బు కోసమే ఇవన్నీ చేస్తున్నారం టున్నారు. నాకు బంగారం కంటే వజ్రాలంటేనే ఎక్కువ ఇష్టం. దయచేసి అంతా ఒక విషయం తెలుసుకోండి. ఎందుకంటే తాత్కాలికమైన మెప్పుకోసం నేను జీవించను’ అని చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్‌ కి పలవురు సెలబ్రిటీలు కామెంట్లు చేసారు. ఇందులో ప్రియాంక చోప్రా..సునీల్‌ శెట్టి కనిపిస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి మంచు లక్ష్మి సుస్మితా సేన్‌ పోస్ట్‌ కి లైక్‌ కొట్టారు. సుస్మితాసేన్‌` లలిత్‌ మోదీల ప్రేమ వ్యక్తిగతం అయినా పబ్లిక్‌ ప్లాట్‌ ఫాంలోకి వచ్చి విషయాన్ని రివీల్‌ చేస్తే సీన్‌ ఇలాగే ఉంటుంది. అందరూ ఒకేలా ఆలోచించలేరు. ఎవరి
సామర్ధ్యం మేర వారు ఆలోచిస్తారు. ఆ రకంగానే స్పందిస్తారు.