పాన్ గల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్ విజయవంతం

పాన్ గల్,ఆగస్టు 11 ( జనం సాక్షి ) భారతదేశానికి స్వాతంత్రం సిద్దించి 75 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవాల పేరిట ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తుంది . అందులో భాగంగా గురువారం పాన్ గల్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ వారు నిర్వహించిన 2కె ఫ్రీడం రన్ విజయవంతమైనట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి , డిప్యూటీ ఎమ్మార్వో చక్రపాణి, మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు.కొత్తపేట స్టేజి వరకు 2కె నిర్వహించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా 2కె రన్ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్సై నాగన్న మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాట యోధులను గుర్తుచేసుకుంటూ ఈ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర పోరాట యోధుల స్పూర్తిని గుర్తు చేస్తూ విద్యార్ధుల్లోనే కాదు ప్రజలందరిలో దేశభక్తి పెంపొందించేందుకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో పాటు ప్రజలు జెండాను చేతపట్టి భారీగా ఫ్రీడం రన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.