పురుగుల మందు తాగి యువ జంట ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: పట్టణంలోని బోయపల్లి గేటు వద్ద యువజంట క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఖిల్లా ఘన్‌పూర్‌కి చెందిన యాదమ్మ(22) తిమ్మాజీపేట మండలం గొరిట గ్రామానికి చెందిన ఎల్లాస్వామి(23) ఇద్దరు గ్రాడ్యుయేట్స్‌ వీరి కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించి వివాహం చేసినా మెట్టినింట యాదమ్మకు వేదింపులు తప్పటం లేదని స్థానికులు తెలిపారు. కుటుంబ తగాదాల కారణంగా వీరు ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.