పోషకాహార వారోత్సవాలు..

కేసముద్రం సెప్టెంబర్ 5 జనం సాక్షి /  మండలంలోని క్యాంపు తండా గ్రామ పంచాయతీ పరిధి మాతృ తండా ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నాడు అంగన్వాడీ ఆధ్వర్యంలో ఘనంగా పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సపావట్ అమ్మి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు ఆకుకూరలు,పప్పు దినుసులు చిరుధాన్యాలు తినాలని, పౌష్టికాహారము, సమతుల్య ఆహారము,చేతుల శుభ్రత, ఆరోగ్య భద్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం రమేష్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, అంగన్వాడీ టీచర్స్  తిరునగిరి వాణి, దొంతి జ్యోతి, బానోత్ స్వప్న, గుగులోత్ నీల, ఆయా ఆమలి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.