ప్రజల ఆదరాభిమానాలే కొండంత అండ


విప్‌ చిర్ల జగ్గిరెడ్డికి నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం
కాకినాడ,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఆలమూరు నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల ఆదరాభిమానాలే కొండంత బలమని ప్రభుత్వ విప్‌, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ చైర్మన్‌, శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గా పదవీ బాధ్యతలు స్వీకరించి కొత్తపేట నియోజకవర్గానికి విచ్చేయుచున్న ఆయనకి నియోజకవర్గ పరిధిలోని మడికి నుంచి మొదలైన భారీ ర్యాలీలో వైయస్సార్‌ సిపి పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అడుగడుగున మహిళా నీరాజనాలతో క్రేన్ల సాయంతో గజమాలలు అలంకరిస్తూ శనివారం ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా లంక గ్రామాల ముఖ్య కేంద్రమైన చెముడులంక, మడికి, చొప్పెల్ల, మూలస్థానం, జొన్నాడల వద్ద వైసీపీ మండల కన్వినర్‌, గ్రామ సర్పంచ్‌ తమ్మన శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్‌ ఆద్వర్యంలో ప్రత్యేక స్వాగతం పలికి పూలమాలలు వేస్తూ దుశ్శాలువాలతో సత్కరించారు. అలాగే జాతీయ రహదారిపై మడికి వద్ద మండల వ్యవసాయ కమిటీ అధ్యక్షుడు యణమదల నాగేశ్వరరావు, పార్టీ సీనియర్‌ నేతలు పడమటి రాంబాబు, చొప్పెల్ల వద్ద తోరాటి లక్ష్మణరావు, దంగేటి బాపణయ్య, సుంకర కామరాజు, మూలస్థానం వద్ద కోణాల పేరెడ్డి, తోట కొండయ్య, జొన్నాడ వద్ద ద్వారంపూడి దొరబాబు, నాండ్ర నాగ మోహన్రెడ్డి, ఆదిత్యా రెడ్డి, నెక్కంటి బుజ్జి, చల్లా నానాజీ తదితర ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ బాణాసంచాతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు అడబాల వీర్రాజు తమ్మన గోపి, దొండపాటి చంటి, పి.రాధాకృష్ణ డి.వెంకట్రామయ్య, డి.శ్రీను, టి.హరి, బి.వీర వెంకట్రావు, ఆర్‌.వెంకటేష్‌ ఎం.సురేష్‌, పి.వెంకట రమణ, ఎస్‌.శ్రీను, దురగయ్య, గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.