ప్రతి ఇంటా ఎల్ఇడి వెలుగులు : ప్రధాని నరేంద్రమోడీ
ఎల్ఈడీ బల్బుల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
హైదరాబాద్,జనవరి5(జనంసాక్షి):: దిల్లీలో ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసే పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం కంటే ఉత్పత్తి చేసినదాన్ని పొదుపుగా వాడుకోవడం మేలన్నారు. ఈ పథకం ద్వారా ఇక నుంచి దిల్లీలోని గృహాలు, వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లనే వినియోగిస్తారన్నారు. వీటి ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణాన్ని కూడా రక్షించిన వారమవుతామని ప్రధాని పేర్కొన్నారు. మార్చి 2016కల్లా 100 పట్టణాలకు ఈ లైట్లు అమర్చడమే తమ లక్ష్యమన్నారు.