ప్రాజెక్టుల పూర్తిచేసిన ఘనత బాబుదే :దేవినేని

విజయవాడ,ఆగస్ట్‌16(జనంసాక్షి): పురుషోత్తమపట్నం,పట్టిసీమ ఎత్తిపోతలు పూర్తి చేయడం ద్వారా సాగునీటి రంగంలో టిడిపి ప్రభుత్వం అద్బుత విజయాలు సాధించామని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హావిూమేరకు నీటిని విడుదల చేసి సిఎం చంద్రబాబు తన పట్టుదలను చాటారని అన్నారు. కానీ సిఎం జగన్‌ పోలవరం అంతా తన ప్రతిభే అని అనుకుంటున్నారని మండిపడ్డారు. రెండేల్లు పూర్తయినా దానిని పూర్తి చేయలేదన్నారు. గోదావరి బేసిన్‌లో ఏటా మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి కలిసిపోతుండగా, కృష్ణా బేసిన్‌కు ఆలమట్టి నుంచి ఇంత వరకు చుక్క నీరు రాలేదన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేయాల్సిన గురుతర బాధ్యత ఇంజినీర్లపై ఉందని పేర్కొన్నారు. పోలవరంలో భూములు కోల్పోవడం వల్ల జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.