బిజెపి కుట్రలు చేస్తోంది

అది ముమ్మాటికీ మతత్వ పార్టీయే అన్న అంజాద్‌ బాషా
అమరావతి,ఆగస్టు7(జనంసాక్షి): బీజేపీ మతతత్వ పార్టీ అంటూ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా బీజేపీపై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏపీలో ఏదో ఒక రకంగా లబ్దిపొందాలని చూస్తున్నారని, రాష్ట్రంలో బలం పెంచుకోవాలని బీజేపీ మత రాజకీయం చేస్తోందని అంజాద్‌ బాషా ద్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ, బీజేపీ విమర్శలకు కౌంటర్‌ ఇవ్వాలని ఏపీ మంత్రులను సీఎం జగన్‌ ఆదేశించారనే ప్రచారం జరుగుతోంది. అందులోభాగంగా బీజేపీని టార్గగెట్‌ చేసుకుని ఏపీ మంత్రలు రెచ్చిపోతున్నారు. శుక్రవారం కేబినెట్‌ భేటీలో మంత్రులపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొంత మంది మంత్రుల వ్యవహరశైలిపై ఆయన సీరియస్‌గా ఉన్నారని చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని ప్రశ్నించారని చెబుతున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని సీఎం నిలదీసినట్లు సమాచారం. సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ప్రస్తావించారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ నేతల మాటలకు కౌంటర్‌ ఇవ్వాలని మంత్రులకు జగన్‌ ఆదేశించారని వినికిడి