బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయండి- మోదీ
దిల్లీ, జనవరి24(జనంసాక్షి)-
‘జన్ ధన్ యోజన’ పథకం కింద ప్రజలు తీసుకున్న బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేయాలని ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు బ్యాంకర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు దేశంలో జనధన్యోజన పథకం కింద 99.74శాతం బ్యాంకు ఖాతాలు తెరుచుకున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకర్లను మోదీ అభినందించారు. దేశంలోని ప్రతి పౌరునికి బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంలో మోదీ ప్రభుత్వం జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఖాతా తెరవటానికి ఎలాంటి నగదు జమచేయాల్సిన అవసరం లేకపోవడంతో దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది.