భాజపాకు కేశూభాయ్‌ ఝలక్‌

పార్టీ సభయత్వానికి రాజీనామా – మోడీపై యుద్ధానికి సిద్ధం
గాంధీనగర్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) : గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్‌ భారతీయ జనతా పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రటించారు. శనివారం తనతో పాటు రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి కాన్షీరాం రాణాతో కలిసి పటేల్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో త్వకలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు.తాము పార్టీకి ఎంతో సేవ చేసినప్పటికీ తమను గుర్తించలేదని వాపోయారు. ముఖ్యమంత్రి నరేంద్రమోడిపై సైతం ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మోడీ నేతృత్వంలో పార్టీ సిద్దాంతాలకు దూరంగా పోతుందన్నారు. ఆయన పార్టీలో నియంతలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ప్రస్తుత మోడి పాలన పట్ల మధ్య తరగతి, పేద ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీని పెట్టబోతున్నట్లు తెలిపారు. గుజరాత్‌ సగటు జీవి విషాదంలో కూరుకుపోవడానికి కారకుడైన మోడీని ఆయన దెయ్యంగా అభివర్ణించారు.