రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి

జోగులాంబ గద్వాల. ఆర్ సి. (జనం సాక్షి)13,
రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి మర్యాదపూర్వకంగా శనివారం గాంధీభవన్ వద్ద ఏఐసీసీ సెక్రెటరీ తెలంగాణ ఇంచార్జ్ నదీమ్ జావీద్ & తెలంగాణ ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ తదితరులతో రాజీవ్ రెడ్డి కలవడం జరిగింది. ఈ సమావేశంలో గద్వాల నియోజకవర్గo సంబంధించి రాజకీయ వాతావరణం గురించి చర్చలు జరిగాయి. ప్రజల గురించి పార్టీ నేతల గురించి బాగోగులను తెలుసుకొని ఇటు కార్యకర్తలును కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలలో చైతన్యం రావాలి అని ప్రజల సమక్షంలో వారికి సహాయ సహకారాలుగా
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ఉండాలని అలాగే ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకుల గురించి పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ప్రజల వెంట నడుస్తూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఈ సమక్షంలో చర్చలు జరిగాయి.