విజయసాయి బెయిల్‌ రద్దుపై నిర్ణయం మీదే

కోర్టులో సీబీఐ మెమో దాఖలు
అమరావతి,ఆగస్ట్‌13(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే సీబీఐ వదిలిపెట్టింది. విచక్షణ మేరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. మరోవైపు సీబీఐ నిర్ణయంపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని విజయసాయిరెడ్డి కోర్టును కోరారు. అనంతరం పిటిషన్‌పై తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.