విద్యార్థులు గ్రామాలకు తరలండి
విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే
మాటతప్పిన కాంగ్రెస్ను ఖతం చేద్దాం
సడక్ బంద్తో స్తంభించాలే
కోదండరామ్ పిలుపు
ఖమ్మం, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు, యువత ఆత్మబలిదానాలు చేసుకు నేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అ న్నారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన పీడీ ఎస్యూ విద్యార్థి గర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆత్మహత్యలకు కారకులైన పాలకులపై హత్యానేరం మోపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాదేమోనని ఎవ రూ దిగులు చెందవద్దని పోరాడి సాధించు కుందామని పిలుపునిచ్చారు. విద్యార్థులు కలత చెందవద్దు.. గ్రామాలకు తరలండి తెలంగాణకు అడ్డుగా ఉన్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీద్దాం అని సూచించారు. తెలంగాణ కాంగ్రె స్ నేతలే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డం కిగా మారారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను విద్యార్థులు నిలదీయాలని, అడ్డుకోవా లని కోదండరాం పిలుపునిచారు. తెలంగాణలో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కాంగ్రెస్ నేతలు పదవులు పట్టుకుని వేళాడుతున్నారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతు న్నారని ఆరోపించారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణపై తేల్చకుంటే రాబోయే రోజుల్లో విద్యార్థులు తీవ్రంగా ఉద్యమం చేస్తారని ఆయన హెచ్చరించారు. తెలంగాణపై ఇప్పటికే ఎన్నోమార్లు మాటతప్పిన కాంగ్రెస్ను ఖతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇవ్వకుంటే ఎవరినైనా వదిలిపెట్టమని, తగిన బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల కోసం పాకులాడటం మాని తెలంగాణ సాధనకు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు పూనుకోవాలని కోరారు. లేనిపక్షంలో వారిని మించిన ద్రోహు లుండరన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సడక్బంద్ను అన్ని వర్గాల ప్రజలు విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. సడక్బంద్తో సకలం స్తంభింపజేయాలని ఆయన కోరారు. ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. ఈ ఉద్యమాన్ని చూసి ఢిల్లీ పెద్దలు దిగిరావాలని అన్నారు.