విద్యుత్‌ వైర్లు తగిలి టిప్పర్‌ దగ్ధం

నెల్లూరు,అగస్టు16(జనంసాక్షి): జిల్లాలో ఓ టిప్పర్‌ కాలి బూడిదయ్యింది. కలువాయి మండలం, కేశమనేనిపల్లిలో కండలేరు కాలువ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న విద్యుత్‌ వైర్లే ఈ ప్రమాదానికి కారణమయ్యాయి. కేశమననిపల్లి సవిూపంలో సోమశిల, కండలేరు కాలువ విస్తరణ పనులు జరుగుతున్నాయి. కాలువ మట్టిపనులు చేస్తుండగా విద్యుత్‌ వైర్లు తగిలి టిప్పర్‌ దగ్ధమైంది. ఈ ఘటనపై
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.