శ్రీవారికి వాడేసిన పూలనుంచి అగర్‌ బత్తీలు

తిరుమల,అగస్టు12(జనం సాక్షి): టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పూల నుంచి అగర్‌బత్తీల తయారీకి శ్రీకారం చుట్టింది.. తిరుమల శ్రీవారికి వినియోగించిన ప్రతీది చాలా విలువైనదిగానే కనిపిస్తుంది. స్వామి రథోత్సవంలో జల్లే ఉప్పు, మిరియాలను కూడా చాలా పవిత్రంగా స్వీరిస్తుంటారు. అలాగే ఉత్పవాల సమయంలో స్వామి పుష్పాలు ఇస్తే తన్మయులవుతుంటారు. శేష వస్త్రం స్వీకరించడానికి దేశాధినేతలు కూడా ఎంతో ఉత్సాహంతో ఉంటారు. ఆలయంలో స్వామికి అలంకరించిన పుష్పాలతో టీటీడీ అగర్‌బత్తీలను తయారుచేస్తోంది.