సిఎం జగన్‌ను మావయ్యూ సంబోధించిన పిల్లలు


గోరుముద్ద కార్యక్రమం మంచిగా ఉందని అభినందన
కాకినాడ,అగస్టు16(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ’ఆల్‌ ద వెరీ బెస్ట్‌’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొంతమంది
విద్యార్థులు వేదికపై తమ అనుభవాలను పంచుకున్నారు. మల్లె వంటి మనసు కలిగిన జగన్‌ మామయ్యకు నా హృదయ పూర్వక నమస్కారాలు. నేను చదివే పాఠశాలలోనే మా నాన్న గారు హెచ్‌ఎమ్‌గా పని చేస్తున్నారు. ప్రతి రోజు నాన్నతోనే పాఠశాలకు వెళతాను. సెకండ్‌ క్లాస్‌ చదివేటప్పుడు 20 మంది స్నేహితులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 88 మంది స్నేహితులయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మన చదువుల కోసం జగన్‌ మామయ్య చేస్తున్న సేవలను మనం తప్పక తెలుసుకోవాలి. పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అమ్మ ఒడి పథకం ద్వారా అందిస్తున్నారు. గతంలో బడికి పోయే టప్పుడు అమ్మ లంచ్‌ బాక్స్‌ పెట్టేది. అదే స్కూళ్లో తినేదాన్ని. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బడి పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ‘ జగనన్న గోరుముద్ద’ కార్యక్రమంలో భాగంగా రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ఆ భోజనం తినటం వల్ల మేము చాలా యాక్టివ్‌గా ఉంటున్నాము. రోజుకో వెరైటీ ఫుడ్‌ తింటున్నాము. ఇలాంటి ఫుడ్‌ అందిస్తున్న జగన్‌ మామయ్యకు చాలా చాలా థాంక్స్‌!’