సీతారామం నుంచి ప్రోమో విడుదల

జూలై16(జనం సాక్షి ):మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ’ఓకే బంగారం’ సినిమాతో పరిచయమైన దుల్కర్‌ ’మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మహానటి తర్వాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ప్రస్తుతం దుల్కర్‌ నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్‌ టీజర్‌లు సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి మేకర్స్‌ తాజాగా థర్డ్‌ సింగిల్‌ ప్రోమోను విడుదల చేశారు. కానున్న కళ్యాణం ఎమన్నది అంటూ సాగే మెలోడియస్‌ సాంగ్‌ ప్రోమోను మేకర్స్‌ తాజాగా విడుదల చేశారు. దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఈ పాటకు సాహిత్యం అందించాడు. అనురాగ్‌ కులకర్ణి, సింధూరి ఆలపించారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో శ్రోతలను ఆకట్టుకుంటుంది. పీ.ఎస్‌ వినోద్‌ కెమెరా విజువల్స్‌ అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ పాట ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ జూలై 18న విడుదల కానుంది. రొమాంటిక్‌ డ్రామా ఎంట్టంల్గªనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుల్కర్‌ లెప్టినెంట్‌ రామ్‌ పాత్రలో నటించనున్నాడు. మృనాళ్‌ థాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న కాశ్మీర్‌ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించనుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై స్వప్న దత్‌ నిర్మిస్తుంది. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది.