స్పీడ్‌ పెంచి డైరెక్టర్‌ శంకర్‌

ఓ వైపు ఆర్‌సి 15..మరోవైపు ఇండియన్‌`2 కు ప్లాన్‌
ఇండియన్‌ జేమ్స్‌ కేమరూన్‌ అనే పేరు తెచ్చుకున్న సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ప్రస్తుతం మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో ఓ భారీ పాన్‌ ఇండియా సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ క్రేజీ స్టార్‌ కియారా అద్వానీ ఇందులో చరణ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. రోబో తర్వాత శంకర్‌ నుంచి వచ్చిన ఐ, రోబో 2.ఓ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. మధ్యలో ఇండియన్‌ ` 2 2 సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆగిపోయింది. దాంతో తెలుగులో మొదటిసారి చేస్తున్న స్టెయ్రిట్‌ మూవీ ఆర్సీ 15 తో భారీ హిట్‌ కొట్టాలని కసిగా ఉన్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు కమల్‌ హాసన్‌తో చేస్తున్న ఇండియన్‌ 2 ప్రాజెక్ట్‌ మళ్ళీ సెట్స్‌ విూదకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ సినిమా చాలా నెలలుగా ఆగిన సంగతి తెలిసిందే. క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల నిలిచిపోయిన ప్రాజెక్ట్‌ మళ్ళీ అన్నీ క్లియర్‌ అవడంతో సినిమాను పూర్తి చేసేందుకు శంకర్‌ ఒప్పుకున్నారు.ఈ నేపథ్యంలో ఇదే ఏడాది డిసెంబర్‌ నుంచి ఇండియన్‌ 2 మిగిలిన చిత్రీకరణ మొదలవనుందని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం సెప్టెంబర్‌ నుంచి ఒకవైపు ఆర్సీ 15 చేస్తూనే మరో వైపు ఇండియన్‌ 2 షూటింగ్‌ కూడా కంప్లీట్‌ చేయనున్నారట. నెలలో సగం రోజులు ఓ సినిమా, మిగతా సగం రోజులు మరో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేందుకు శంకర్‌ ఎª`లాన్‌ చేస్తున్నారట. అలా గనక కంప్లీట్‌ అయితే రెండు భారీ పాన్‌ ఇండియన్‌ చిత్రాలు శంకర్‌ నుంచి రావడం గ్యారెంటీ.