నూతన విద్యావిధానం తీసుకొస్తాం

3

కేంద్ర మంత్రి సృతిఇరానీ

హైదరాబాద్‌, ఆగస్టు 24(జనంసాక్షి) : నూతన విద్యావిధానం తీసుకొస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి సృతిఇరానీ అన్నారు. దేశంలోని గొప్ప వ్యక్తులను మర్చిపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో ఓ సదస్సులో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. ప్రతిఒక్కరూ సాంస్కృతిక విద్యావిలువలు నేర్చుకోవాలని ఆమె సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానం రూపొందిస్తామని స్మృతి ఇరానీ స్పష్టంచేశారు. ఫిబ్రవరి 21వ తేదీన అన్ని స్కూళ్లలో మాతృభాషా దినోత్సవం జరుపుతామని ఆమె తెలిపారు. విద్యార్థులు నైతిక విలువలు అలవర్చుకోవాలన్నారు. గురు-శిష్యుల బంధం ఎప్పటకీ విడదీయరానిదని ఆమె అన్నారు. భ్రూణ హత్యలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.