విజేత సానియాను అభినందించిన కేసీఆర్‌

2
హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 9(జనంసాక్షి) :

యుఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజేత సానియా మీర్జా మంగళవారం సీఎం అధికార నివాసంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. కేసీఆర్‌గారి ప్రోత్సాహం వల్లే తాను టైటిల్‌ సాధించగలిగానని సానియా చెప్పారు. సానియా మీర్జాను ముఖ్య మంత్రి మనసారా అభినందించారు. సానియా సాధించిన విజయం మరెందరికో ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని అందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్యత్తులో సానియా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిం చారు. ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందిస్తామని సీఎం వెల్ల డించారు. తన విజయాన్ని తెలంగాణ ప్రజలకు, భారత ప్రజలకు అంకితమిస్తున్నట్లు సానియా ప్రకటించడం పట్ల కూడా కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. త్వరలో ప్రభుత్వం తరపున సానియాను సన్మానించనున్నారు.