మహిళపై లైంగిక వేధింపులు

ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసిన యూపి పోలీసులు
లక్నో,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను యూపీ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బాఘ్‌పట్‌లోని బినౌలీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బాధితురాలకి ఫేస్‌బుక్‌లో విపిన్‌ అనే వ్యకి పరిచయం ఏర్పాడింది. దీంతో వీరి ఇద్దరి మధ్య స్నేహం కూడా కుదరాడంతో కొన్ని రోజులకు బాగానే ఛాటింగ్‌ చేసుకున్నారు. ఇంతలోనే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో విపిన్‌ బాధితురాలిని ఫ్రెండ్‌ నుంచి అన్‌ఫ్రెండ్‌ చేశాడు. అనంతరం గుర్‌గావ్‌లోని పసిఫిక్‌ మాల్‌ లో ఉన్న ఆ బాధితురాలి దగ్గరకు విపిన్‌ వచ్చి ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత విపిన్‌ తన స్నేహితులతో కలిసి ఆ మహిళను లైంగికంగా వేధించాడంతో బాధితురాలు వారి నుండి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి విపిన్‌, ఆశిష్‌ బియాల్యాన్‌ లను పట్టుకొని అదుపులోకి తీసుకుని విచారించడంతో వారు బాధితురాలి కుటుంబాన్ని ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని విపిన్‌ అతని స్నేహితులు బెదిరించినట్టుగా చెప్పారని బాఘ్‌పట్‌ ఎఎస్‌ పి రన్‌విజయ్‌ సింగ్‌ తెలిపారు. ఈ మేరకు నింధితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన్నట్టుగా పోలీసులు తెలిపారు.