మైనర్‌ బాలికపై అత్యాచారం: రియాల్టీ షో కంటెస్టర్‌పై కేసు

ముంబై,జూన్‌20(జ‌నం సాక్షి ): మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీవీ రియాలిటీ షో కంటెస్టెంట్‌ను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనిపై పోస్కో కేసు పెట్టారు. ఆదిత్యాగుప్తా (20) అనే డ్యాన్సర్‌ రియాలిటీ షోలో పాల్గొంటున్నాడు. ఆదిత్యాగుప్తా సబర్బన్‌ అంధేరీకి చెందిన 17 ఏండ్ల బాలికను సోషల్‌విూడియా ద్వారా పరిచయం చేసుకున్నాడు. గత ఆదివారం ఆదిత్యాగుప్తా, బాలిక కలిశారు. ఆదిత్య ఆ బాలికను పాల్ఘర్‌ జిల్లాలోని నలసొంపురలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. మత్తు మందుకు కలిపి ఉన్న కూల్‌డ్రింక్‌, ఆహారాన్ని బాలికకు ఇచ్చి..ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను సవిూపంలోని ప్రాంతంలో వదిలిపెట్టాడు. మెలకువ వచ్చిన తర్వాత బాలిక తన తల్లిదండ్రులకు సమాచారమందించింది. కేసు నమోదు చేసుకున్న కైం బ్రాంచ్‌ యూనిట్‌ 9 పోలీసులు సీసీ టీవీ పుటేజీ, బాలిక కాల్‌ రికార్డ్సు ఆధారంగా నిందితుడు ఆదిత్యాగుప్తాను అదుపులోకి తీసుకున్నారు. ఆదిత్యాగుప్తాపై పోస్కో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.