మద్దూరు (జనంసాక్షి) జూన్ 25 : మండల పరిధిలోని వల్లంపట్ల గ్రామ శివారులో తరిగొప్పుల మండలం సొలిపుర్ గ్రామానికి చెందిన అనాధ వంగా రాఘవరెడ్డి (65) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ సందర్బంగా కో ఆపరేటివ్ సొసైటీ జిల్లా డైరెక్టర్ ఆలేటి యాదగిరి మాట్లాడుతూ.. రాఘవరెడ్డి కి తోడపుట్టిన వాల్లు బందువులు ఎవరు లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ అడుక్కొని అన్నం తింటూ గుడి వద్ద పాఠశాల విద్య ఉండేవాడని గత 15 రోజులుగా గ్రామంలో కనబడలేదని అలాగే సొంత గ్రామానికి కూడా వెళ్లలేదని ఈరోజు ఉదయం పశువుల కాపరులకు మృతదేహం కనబడటంతో మాకు సమాచారం అందించడంతో మేము ఎస్ఐ నారాయణ కి సమాచారం అందించగా వారు తమ సిబ్బందితో ఘటన స్థలానికి వచ్చి మృతదేహానికి పంచనామా నిర్వహించి అనంతరం వైద్య అధికారిని పిలిపించి పోస్టుమార్టం చేయించారు. వల్లంపట్ల గ్రామ సర్పంచ్ ఆలేటి రజిత యాదగిరి, సోలిపుర్ గ్రామ సర్పంచ్ ఎర్ర సిద్ధులు కలిసి అనాధ శవానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అశోక్, గ్రామ కార్యదర్శి మహేందర్,పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
అనాధ శవానికి దహన సంస్కారాలు చేసిన సర్పంచులు
Other News
- నివాళులు అర్పించిన టిపిసిసి నాయకులు సుజిత్ రావు
- అక్రమంగా నిర్వహించిన రేషన్ బియ్యం పట్టివేత పట్టణ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి
- అల్లుడి చేతిలో మామ హతం
- కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి
- దళిత యూత్ కు రాజకీయాలకు సంబంధం లేదు
- టాటా స్టీల్ చెస్ ఇండియా మహిళల నాల్గవ టోర్నీ
- ఎమ్ ఆర్ ఓ ,మున్సిపల్ చైర్మన్ కు ఘన సన్మానం
- కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలి
- విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన విద్య కమిటీ చైర్మన్ చంద్రశేఖర్
- *రక్తదానం చేసి,మరొకరి ప్రాణాన్ని కాపాడండి*