‘సిగాచీ’ సీఈవో అరెస్ట్‌

` రిమాండ్‌కు తరలించిన పోలీసులు
హైదరాబాద్‌(జనంసాక్షి):సిగాచీ సంస్థ సీఈవో అమిత్‌రాజ్‌ సిన్హాను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఏడాది జూన్‌ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో భారీ విస్ఫోటం సంభవించి.. 54 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వివిధ అంశాలపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా సిగాచీ సీఈవోను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.