బూర్గంపహాడ్ మే 23 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన శ్రమశక్తి అవార్డు గ్రహీత ఐ టి సి. పి ఎస్ పి డి గల్లా నాగభూషయ్య కు యాదవ సంఘం తరఫున ఆదివారం రాత్రి ఘనంగా సన్మానించారు. ఐ టి సి. పి ఎస్ పి డి లో నలభై సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరు కొనియాడారు. టి ఎన్ టి యు సి లో కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ చైర్మన్ స్థాయికి చేరుకొని తన చుట్టూ ఉన్న వారికి సహాయ సహకారాలు అందిస్తూ తన వద్దకు వచ్చిన సమస్యను ఐటిసి యాజమాన్యంతో చర్చించి పరిష్కరించి కార్మికులకు న్యాయం చేసే వారిని పలువురు కొనియాడారు. ఆయన ద్వారా ఎంతో మంది కార్మికులు ఐ టి సి లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఐ టి సి యాదవ సంఘం కార్మికులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ మండల అధ్యక్షులు గల్లా సైదేశ్వర రావు, వెంకటరామారావు, యువ కార్మికులు పెరుగు నాగేశ్వరావు, బండారు సత్యనారాయణ, జక్కుల రాంబాబు, శీలం చలమయ్య, పిల్లి శీను, పిడుగు కొండలరావు, సీనియర్ కార్మికులు వెంకట్రామయ్య, ఆనంద్, పోలీస్ ప్రసాద్, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చందు, గొడపర్తి రాంబాబు, మద్ది బోయిన ప్రవీణ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
శ్రమశక్తి అవార్డు గ్రహీత నాగభూషయ్య కు ఘన సన్మానం
Other News
- నిరుపయోగంగా దౌల్తాబాద్ ప్రయాణ ప్రాంగణం.
- 15వ వార్డులో పడిపోయిన ఇంటిని శుభ్రం చేయించిన కౌన్సిలర్
- మాజీ కార్పొరేటర్ ముద్ర బోయిన శ్రీనివాస్ తో కలిసి మైత్రి నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే_దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
- *రైతులు పొలాల్లో జీలుగ సాగుచేస్తే భూసారం పెరుగుతుంది:వ్యవసాయ శాఖ*
- పాఠ్యపుస్తకాలు బూక్కులు లేవు .. యూనిఫామ్ లేదు ...సారు
- కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలి... * వర్ధంతి సభలో జూలకంటి..
- మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్.....
- *జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు *
- .....బెస్ట్ పర్ఫామెన్స్ ఎంపీడీవో గా లెంకల గీతారెడ్డి.......