జనాలపైకి దూసుకువచ్చిన ఎద్దు-ఇద్దరికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌: జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌ కాలనీలో ఓ ఎద్దు జనాలపైకి దూసుకువచ్చింది. కొమ్ములతో దాడి చేయటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జిల్లా కేంద్రంలోని రివమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పోందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.