పగోజిలో 17.9 మీ.మీ. వర్షపాతం
ఏలూరు, ఆగస్టు 3 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో 17.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళికా శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ కె. సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అత్యధికంగా మొగల్తూరు మండలంలో 36.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కాగా జీలుగుమిల్లిలో 17.2, బుట్టాయిగూడెంలో 25.6, పోలవరంలో 28.8, తాళ్లపూడిలో 25.4, గోపాలపురంలో 17.6, కొయ్యలగూడెంలో 24.4, జంగారెడ్డి గూడెంలో 13.8, టి. నర్సాపురంలో 15, చింతలపూడిలో 11.8, లింగపాలెంలో 16.8, కామవరపు కోటలో 9.2, ద్వారకాతిరుమలలో 10.2, నల్లజర్లలో 8.2, దేవరపల్లిలో 13.4, చాగల్లులో 23.4, కొవ్వూరులో 19.8, నిడదవోలులో 13.6, తాడెపల్లి గూడెంలో 26, ఉంగుటూరులో 15.4, భీమఢోలులో 16.6, పెదవేగిలో 8.2, పెదపాడులో 15.4, ఏలూరులో 12.2,వ దెందులూరులో 7.2, నిడమర్రులో 16.6, గణపవరంలో 11, పెంటపాడులో 21.2, తణుకులో 35.2, ఉండ్రాజవరంలో 16.8, పెరవలిలో 21.8, ఇరగవరంలో 23.2, అత్తిలిలో 16.6, ఉండిలో 17.6, ఆకివీడులో 21, కాళ్లలో 25.2, భీమవరంలో 17.2, పాలకోడేరులో 13.8, వీరవాసరంలో 13.4, పెనుమంట్రలో 14.4, పెనుగొండలో 24.4, ఆచంటలో 23.2, పోడూరులో 15, పాలకొల్లులో 13, యలమంచిలిలో 16.2, నరసాపురం మండలంలో 20 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదు అయింది.